అత్యవసరమైన పనిలో ఉండగా మన ఫోన్లకు వచ్చే అవసరం లేని ప్రమోషనల్ బిజినెస్ కాల్స్, సందేశాలు చికాకు తెప్పిస్తుంటాయి. ఒక్కోసారి విపరీతమైన కోపానికి కూడా దారితీస్తుంది. ఇలాంటి ఫోన్లు, మెసేజ్లకు త్వరలో చెక్ పడనున్నది. వీటి కట్టడికి సంబంధించి కేంద్ర వినియోగదారు వ్యవహారాల మంత్రిత్వ శాఖ గురువారం ముసాయిదా మార్గదర్శకాలు జారీచేసింది. ఈ నిబంధనలపై జూలై 21న ప్రజలు అభిప్రాయాలు తెలియజేసేందుకు అవకాశం కల్పించింది.