ఘట్కేసర్-లింగంపల్లి మధ్య ఎంఎంటీఎస్ సర్వీసులు

76చూసినవారు
ఘట్కేసర్-లింగంపల్లి మధ్య ఎంఎంటీఎస్ సర్వీసులు
రేపటి నుంచి ఘట్కేసర్-లింగపల్లి మధ్య ఎంఎంటీఎస్ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఉదయం 7.20 గంటలకు ఘట్కేసర్‌లో బయల్దేరనున్న రైలు.. ఉదయం 9.15 గంటలకు లింగంపల్లి చేరుతుంది. సాయంత్రం 5.45 గంటలకు లింగంపల్లిలో బయల్దేరి రాత్రి 7.30 గంటలకు ఘట్కేసర్ చేరుతుంది. చర్లపల్లి, నేరెడ్మెట్, అమ్ముగూడ, భూదేవీనగర్, సుచిత్ర, ఫిరోజ్‌గూడ, భరత్‌నగర్, బోరబండ, హైటెక్ సిటీ, హఫీజ్‌పేట్, చందానగర్ స్టేషన్లలో ఈ రైళ్లు ఆగుతాయి