తెలంగాణలో 40 డిగ్రీలకు పైగా ఎండలు

116440చూసినవారు
తెలంగాణలో 40 డిగ్రీలకు పైగా ఎండలు
తెలంగాణలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలను మించిపోయాయి. దీంతో రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్‌ను జారీచేసింది. నిర్మల్ రికార్డు స్థాయిలో 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్ - 43డిగ్రీలు, కొమురం భీమ్-42.6, మంచిర్యాల-42.5, నిజామాబాద్-41.3, పటాన్ చెరు-40.2, రాజేంద్రనగర్–40.1, మెదక్, రామగుండం, ఖమ్మం, భద్రాద్రి, నల్గొండలో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

సంబంధిత పోస్ట్