బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లోక్సభ ఎన్నికల తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు సంభవిస్తాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్ లో ఇంటింటి ప్రచారం ప్రారంభించి మాట్లాడారు. 'రాష్ట్రంలో BJPకి 12 MP సీట్లు వస్తాయని కాంగ్రెస్ నేతలే చెబుతున్నారు. ఇప్పటికే అధికార పార్టీలో రాజకీయాలు మొదలయ్యాయి. 100 రోజుల్లో అమలు కాని కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలు.. ఆగస్టు తర్వాత ఎలా అమలవుతాయి?' అని ప్రశ్నించారు.