తల్లి సుబ్బమ్మ ప్రోత్సాహంతో ఉన్నత విద్యాభ్యాసం చేసిన ఎంఎస్ ఖాళీ రోజుల్లో మాత్రం నాటకాలు వేస్తు గడిపేవారు. తన స్నేహితులతో కలిసి బాలనాగమ్మ, భట్టి విక్రమార్క వంటి పౌరణిక నాటకాలతో పాటు, సాంఘిక నాటకాలు వేసి అందర్ని మెప్పించేవారు. భీమవరం కేజీఆర్ఎల్ కళాశాలలో తెలుగు లెక్చరర్గా పని చేస్తున్న సమయంలో దివిసీమ ఉప్పెన సంభవించింది. తోటి కళాకారులతో కలిసి వివిధ ప్రాంతాల్లో నాటకాలు వేసి విరాళాలు సేకరించి దివి సీమ ప్రజలకు అందించారు.