తెలంగాణ రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం జిల్లాలో జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. ముస్లింల మద్దతు ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీకేనని అన్నారు. కాంగ్రెస్ అంటేనే ముస్లిం సోదరుల పార్టీ అని, ఈ పార్టీ వారికే సొంతం అన్నారు. వారి హస్తం లేకుండా కాంగ్రెస్ ఏనాడూ అధికారంలోకి రాదన్నారు. ఈ లోక్ సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని అందుకు ముస్లింలే కారణమని అన్నారు. ప్రస్తుతం తుమ్మల చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.