ముస్లింల ఓట్లు ఉంటే చాలు.. మంత్రి తుమ్మ‌ల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

58చూసినవారు
ముస్లింల ఓట్లు ఉంటే చాలు.. మంత్రి తుమ్మ‌ల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
తెలంగాణ రాష్ట్ర మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఖమ్మం జిల్లాలో జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. ముస్లింల మద్దతు ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీకేనని అన్నారు. కాంగ్రెస్ అంటేనే ముస్లిం సోదరుల పార్టీ అని, ఈ పార్టీ వారికే సొంతం అన్నారు. వారి హస్తం లేకుండా కాంగ్రెస్ ఏనాడూ అధికారంలోకి రాదన్నారు. ఈ లోక్ సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని అందుకు ముస్లింలే కారణమని అన్నారు. ప్ర‌స్తుతం తుమ్మ‌ల చేసిన వ్యాఖ్య‌లు వివాదాస్పదంగా మారాయి.