సీమా హైదర్ ఇండియాకి వచ్చిన తర్వాత, పాకిస్తాన్లోని ఆమె భర్త గులాం హైదర్ సోషల్ మీడియా ప్లాట్ఫారంపై తన సొంత యూట్యూబ్ ఛానెల్ని ప్రారంభించాడు. దీని ద్వారా గులాం హైదర్ తన సందేశాన్ని భారత్, పాకిస్తాన్ ప్రజలకు తెలియజేయజేసే ప్రయత్నం చేస్తున్నాడు. సీమా తనను మోసం చేసిందని, నా ఇళ్లు అమ్మి ఇండియాకు వచ్చిందని ఆయన ఆరోపిస్తున్నారు. ఏదో ఒక రోజు నేను నిన్ను ఉరికంబం ఎక్కిస్తాను.. ఇదే నా జీవిత లక్ష్యమని అన్నారు.