మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ జిల్లాలో శుక్రవారం ఊహించని ఘటన జరిగింది. భడవలి గ్రామంలో వరుడు బ్యాండ్ బాజాతో ఊరేగింపుగా పెళ్లి మండపానికి చేరుకున్నాడు. ఆ సమయంలో వరుడు మద్యం మత్తులో ఉన్నాడని వధువు గమనించింది. అలాంటి వ్యక్తి తనకు ఇష్టం లేదని పెళ్లి రద్దు చేసింది. పెద్దలు నచ్చజెప్పినా ఆమె వినలేదు. దీంతో వధువు తరుపు వారిపై వరుడు, అతని తరుపు బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.