ఎలాన్ మస్క్ భారత పర్యటన వాయిదా

75చూసినవారు
ఎలాన్ మస్క్ భారత పర్యటన వాయిదా
టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఇండియా పర్యటన వాయిదా పడింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియా వేదికగా తెలిపారు. టెస్లాకు సంబంధించిన ముఖ్యమైన పనులతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. అయితే ఈ ఏడాదిలోనే భారత్‌లో పర్యటించేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు ట్వీట్ చేశారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు మస్క్ ఆసక్తి కనబరుస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన పర్యటనపై సందిగ్ధత నెలకొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్