పడవ బోల్తా.. ఏడుగురు మృతి

55చూసినవారు
ఒడిశా ఝార్సుగూడ జిల్లాలోని మహానదిలో శుక్రవారం పడవ బోల్తా పడి ఏడుగురు మృతి చెందారు. సాయంత్రం దాదాపు 50 మందికిపైగా ప్రయాణికులతో పథర్సేని కుడా నుంచి బర్గర్ జిల్లాలోని బంజిపాలి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వెంటనే గమనించిన స్థానిక మత్స్యకారులు నదిలోకి దూకి 35 మందిని కాపాడారు. గల్లంతైన వారికోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు 48 మందిని కాపాడగా.. గల్లంతైన ఏడుగురి మృతదేహాలను వెలికి తీశారు.

సంబంధిత పోస్ట్