ప్రసాదం కోసం ఆలయానికి వచ్చిన భక్తుల వాహనాలతో సుమారు 10కి.మీ మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఈ ట్రాఫిక్ జామ్ కాకుండా.. ఆలయం నుంచి మొదలుకుని హిమయత్నగర్ గ్రామం వరకు ఎక్కడ ఖాళీ స్థలం కనబడితే అక్కడ పార్కింగ్ చేసిన వాహనాలు ఇంకెన్నో. హైదరాబాద్ సిటీతో పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుంచి సుమారు 2 లక్షలకు పైగా వచ్చారు. అందులో గరుడ ప్రసాదం కోసం వచ్చిన మహిళలు లక్ష మంది వరకు ఉంటారు.