కడప ఎంపీ స్థానానికి ఇవాళ ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘రాజశేఖర్ రెడ్డి, వివేకాను ప్రజలు ఇంకా మర్చిపోలేదు. ప్రజలు న్యాయం వైపు ఆలోచించాలి. జగన్పై చిన్న రాయితో కొడితేనే హత్యాయత్నం అంటున్నారు. విజయమ్మను కూడా అవమానించే స్థాయికి దిగజారిపోయారు. ఈ హత్యా రాజకీయాలు అంతం కావాలి.’ అని అన్నారు.