లోక్సభ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. పంజాబ్ రాష్ట్రానికి చెందిన సీనియర్ నేత తాజిందర్ సింగ్ బిట్టు ఏఐసీసీ కార్యదర్శి పదవికి, హిమాచల్ప్రదేశ్ కాంగ్రెస్ ఇన్ఛార్జి పదవికి, కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు తన రాజీనామా లేఖ పంపారు. అనంతరం ఆయన ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో కాషాయ కండువా కప్పుకున్నారు.