‘ధావన్ కరేంగే’ షోలో టీమ్ ఇండియా క్రికెటర్ శిఖర్ ధావన్ మాట్లాడుతూ తనపై వచ్చిన వదంతులను ఖండించాడు. గతంలో మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్తో ధావన్ ప్రేమాయణం సాగిస్తున్నట్లు, పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయని చెప్పాడు. ధావన్ 2012లో ఆస్ట్రేలియాకు చెందిన బాక్సర్ ఆయేషా ముఖర్జీని వివాహం చేసుకున్నాడు. వీరికి ఓ కుమారుడున్నారు. మనస్పర్థలు రావడంతో గతేడాది విడాకులు తీసుకున్నారు.