Mar 31, 2024, 00:03 IST/వనపర్తి
వనపర్తి
వడ్ల బస్తాల దొంగల అరెస్ట్
Mar 31, 2024, 00:03 IST
కొంతకాలంగా వడ్ల బస్తాలను దొంగతనం చేస్తూ వికయిస్తున్నా దొంగల ముఠాను శనివారం పెబ్బేరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్ఐ హరి ప్రసాద్ రెడ్డి వివరాల ప్రకారం. జడ్చర్ల మండలం బడ్డేపల్లికీ చెందిన కొయ్య ప్రణయ్, రాయల రాజు, ఎండి. సమీర్, ఎండి. యాసిన్, వనపర్తి జిల్లాలో వడ్లను దొంగలించి, అశోక్ లైలాండ్ లో వెళుతుండగా వారిని అనుమానంతో ప్రశ్నించగా వడ్లను దొంగతనాలు చేసినట్లు ఒప్పుకున్నారు. వారి నుండి రూ. 3, 40, 000 రికవరీ చేసి, రిమాండ్ కు పంపినట్లు ఎస్ఐ తెలిపారు.