శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యణోత్సవం ముగింపు వేడకలు

1517చూసినవారు
చౌటుప్పల్ మండలం దేవలమ్మ నాగారం గ్రామంలో శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యణోత్సవ ముగింపు కార్యక్రమాలను దేవాలయ కమిటీ మరియు ఉత్సవ కమిటీ బాలభక్త సమాజం, గ్రామ పెద్దలు ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో కన్నుల పండువగా సీతారామ కళ్యాణము నిర్వహించారు. అనంతరము బుధవారం తెల్లవారుజామున ఉత్వవ మూర్తులను గ్రామ పురవిదుల గుండా స్వామివారినీ శోబా యాత్ర గా రధత్సవం పై ఊరేగించారు. ఇట్టి కార్యక్రమంలో ఆడపడుచులు చిన్న పెద్దలు కోలాటం అటలతో రాములవారి పండుగను జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ అధ్యక్షుడు సిలివెరు రమేష్, ఉత్సవ కమటీ అధ్యక్షుడు పులిగిల్ల రాముచారి, బాబు చారి అత్తాపూరం రాజురెడ్డి, డకోజి రమేష్, పున్న యాదగిరి, వెంకట్ రెడ్డి, శ్రీను చారి, లక్ష్మణ చారి, మల్లేష్, శరత్, బలారెడ్డీ మరియు గ్రామ పెద్దలు, చిన్నలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :