ప్రజాదర్బార్ లో పాల్గొన్న మంత్రి

69చూసినవారు
లేని వారిని ఆదుకోవడమే తన లక్ష్యమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి అన్నారు. సోమవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయం వద్ద ఉన్న మున్సిపల్ పార్కులో ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు. జిల్లా కలెక్టర్ తో కలిసి సమస్యలపై సంబంధిత అధికారులకు స్వయంగా ఆయన ఫోన్ చేసి ఫిర్యాదులు పరిష్కరించాలని ఆదేశించారు.

ట్యాగ్స్ :