నల్లగొండ: ఐటిఐలో కొత్త కోర్సులకు అడ్మిషన్లు

79చూసినవారు
నల్లగొండ: ఐటిఐలో కొత్త కోర్సులకు అడ్మిషన్లు
2024-2025 విద్యా సంవత్సరంలో నల్లగొండ ఐటిఐలో కొత్తగా ప్రారంభించిన కోర్సులకు ఆరవ దశ వాక్ ఇన్ అడ్మిషన్లు ఈనెల 9 వరకు జరుగుతాయని ప్రభుత్వ ఐటిఐ ప్రిన్సిపల్ ఏ. నరసింహ చారి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణత కలిగిన విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. అభ్యర్థులు https: //iti. telangana. gov. in రేపు సైట్ లో నమోదు చేసుకొని ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఈనెల 9వ తేదీలోగా హాజరు కావాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్