ప్రభుత్వ ఆయుర్వేదిక్ హాస్పిటల్ 6 నెలల నుండి తెరవడంలేదు
నారాయణపురం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆయుర్వేదిక్ హాస్పిటల్ తెరవడం లేదని కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మదుగుల బాలకృష్ణ, వృద్దుల సంఘం మండల అధ్యక్షులు పాశం ధర్మయ్య శుక్రవారం అన్నారు. గత 6నెలలు నుండి ఆయుర్వేదిక్ హాస్పిటల్ తెరవడం లేదు. అనారోగ్యంతో ఉన్నవారు వైద్య సదుపాయం లేక ఇబ్బందులు పడుతున్నారని, తక్షనమే డాక్టర్లను, మిగతా సిబ్బందిని పెట్టి వైద్యం అందించే విధంగా సంబంధిత అధికారులు చర్య తీసుకోవాలని కోరారు.