బంగ్లా పీఎం షేక్ హసీనాకు నరేంద్ర మోడీ ఫోన్

613చూసినవారు
బంగ్లా పీఎం షేక్ హసీనాకు నరేంద్ర మోడీ ఫోన్
బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి ప్రధాని షేక్ హసీనా, ఆమె పార్టీ అవామీ లీగ్ ఘన విజయం సాధించింది. ఆదివారం జరిగిన ఎన్నికల్లో గెలిచి నాలుగోసారి ప్రధాని కాబోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాకు ఫోన్ చేశారు. వరుసగా నాలుగోసారి ఎన్నికల్లో గెలిచినందుకు అభినందనలు తెలియజేశారు. ప్రతిపక్ష బీఎన్పీ పార్టీతో పాటు ఇతర పార్టీలు ఈ ఎన్నికలను బహిష్కరించిన విషయం తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్