రేపు రాష్ట్రపతిని కలుసుకోనున్న ఎన్డీయే నేతలు (Video)

57చూసినవారు
కూటమిపరంగా లాంఛనాలన్నీ పూర్తికావడంతో.. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశమివ్వాలని కోరుతూ ఎన్డీయే నేతలంతా రేపు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు అధికారికంగా విజ్ఞప్తి చేయనున్నట్లు సమాచారం. అంతకంటే ముందు, అదే రోజు బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశమై మోదీని తమ నాయకుడిగా ఎన్నుకోనుంది. అనంతరం ఎన్డీయే పక్షాల ఎంపీలు, సీఎంలు, ఉప ముఖ్యమంత్రులంతా సమావేశమై ఆయన నాయకత్వానికి మద్దతు పలుకనున్నారు.