రాజస్థాన్లోని కన్వాటియా ఆస్పత్రికి చెందిన ముగ్గురు డాక్టర్లు సస్పెన్షన్కు గురయ్యారు. బుధవారం ఓ గర్భిణీ ఆస్పత్రికి రాగా.. ఆమెను లోపలికి అనుమతించకుండా డాక్టర్లు నిర్లక్ష్యం చేశారు. దీంతో ఆస్పత్రి బయటే ఆమె బిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటనపై విచారణ జరిపిన ఉన్నతాధికారులు ఆస్పత్రి రెసిడెంట్ డాక్టర్లైన కుసుమ్ సైనీ, నేహా రాజావత్, మనోజ్లను సస్పెండ్ చేశారు.