అమెరికాకు అక్రమంగా తరలించే ముఠా 11 మంది భారతీయులను నేపాల్లో బంధించింది. ఈ విషయం తెలుసుకున్న ఆ దేశ పోలీసులు కాఠ్మండులోని ఒక ఇంటిపై రైడ్ చేశారు. ఆ ముఠా బంధించిన భారతీయులను రక్షించారు. ఢిల్లీ, హరియాణాలకు చెందిన సుమారు 11 మంది అక్రమమార్గంలో అమెరికా వెళ్లేందుకు ప్రయత్నించారని, ముఠాకు ఒక్కొక్కరు రూ.45లక్షల చొప్పున చెల్లించారని నేపాల్ పోలీసులు తెలిపారు.