పెన్సనర్లను ఏపీ ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. మే 1 నుంచి మూడు రోజుల పాటు పెన్షన్లు పంపిణీ చేస్తామంటూ ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. నిన్న మేడే బ్యాంకులకు సెలవు కావడంతో ఈరోజు ఉదయం నుంచి బ్యాంకుల వద్దకు పెన్షనర్లు చేరుకున్నారు. పెన్షన్ల కోసం బ్యాంకుల వద్ద పెన్షన్దారులు పడిగాపులు కాస్తున్నారు. బ్యాంకు అధికారులు చెబుతున్న రూల్స్తో పింఛన్దారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.