జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి అసెంబ్లీకి అడుగుపెడితే పిఠాపురం ప్రపంచ స్థాయికి చేరుతుందని యువ హీరో, మెగాస్టార్ మేనల్లుడు వైష్ణవ్ తేజ్ అన్నారు. పవన్కు మద్దతుగా వైష్ణవ్ తేజ్ ఉప్పాడ కొత్తపల్లి మండలంలో పలు గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా హీరో వైష్ణవ్ తేజ్ మాట్లాడుతూ తన చిన్నప్పటి నుంచి పవన్ను అతి దగ్గరగా చూస్తున్నానని ఆయన ఏదైనా అనుకుంటే కచ్చితంగా సాధిస్తారని అన్నారు.