కవ్వాల్ అభయారణ్యంలో అటవీ ఆంక్షలు ఎత్తివేయాలని కోరుతూ జన్నారం పట్టణంలో నిరసన వ్యక్తం చేసిన సామాజికవేత్త భూమాచారికి పలువురు మద్దతు తెలియజేశారు. మంగళవారం భూమాచారి జన్నారం పట్టణంలో ఫ్లెక్సీతో నిరసన వ్యక్తం చేశారు. ఆయనకు జన్నారం పట్టణానికి చెందిన మామిడి విజయ్, జియావుద్దీన్ లతో పాటు పలువురు మద్దతు తెలిపారు. అటవీ అంశాలతో జన్నారం పట్టణం పూర్తిగా వెనుకబడి ఉందని, ఆ ఆంక్షలను ఎత్తివేయాలని వారు కోరారు.