మిషన్ భగీరథకు తొమ్మిది క్యూసెక్కులు

77చూసినవారు
మిషన్ భగీరథకు తొమ్మిది క్యూసెక్కులు
మిషన్ భగీరథ పథకానికి కడెం ప్రాజెక్టు నుండి 9 క్యూసెక్కుల నీటిని వదులుతున్నామని ఆ ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. కడెం ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 700 అడుగుల కాగా, సోమవారం ఉదయం ప్రాజెక్టులో 671. 7 అడుగుల నీటిమట్టం ఉందన్నారు. ఎగువన వర్షాలు లేక ప్రాజెక్టులోకి వరద నీరు రావడం లేదు. వివిధ నీటి అవసరాల నిమిత్తం ప్రాజెక్టు నుండి 78 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ఆయకట్టుకు సాగునీటిని విడుదల చేయడం లేదు.

సంబంధిత పోస్ట్