ప్రజల బాధను ప్రభుత్వం అర్థం చేసుకోవడం లేదు

80చూసినవారు
ప్రజల బాధను ప్రభుత్వం అర్థం చేసుకోవడం లేదు
జన్నారం మండల ప్రజల బాధను ప్రభుత్వం అర్థం చేసుకోవడం లేదని జన్నారం పట్టణానికి చెందిన సామాజికవేత్త భూమాచారి ఆవేదన వ్యక్తం చేశారు. కవ్వాల్ అభయారణ్యంలో ఆంక్షలు ఎత్తివేయాలని కోరుతూ ఆయన చేపట్టిన పాదయాత్ర బుధవారం జన్నారం మండలంలోని మొర్రిగూడ గ్రామంలో ఉన్న ఎస్సీ కాలనీలో జరిగింది. ఈ సందర్భంగా ఆంక్షలతో వస్తున్న నష్టాల గురించి ఆయన గ్రామస్తులకు వివరించారు. ఆంక్షలు ఎత్తి వేసే వరకు తమ ఉద్యమం కొనసాగుతుందన్నారు.

సంబంధిత పోస్ట్