మృతదేహంతో వైన్ షాపు ముందు ఆందోళన
నిర్మల్ జిల్లా లొకేశ్వరం మండల కేంద్రానికి చెందిన పోతారాజు ప్రశాంత్ అనే వ్యక్తి మద్యం తాగి మంగళవారం సాయంత్రం మండల కేంద్రంలోని లక్కీ వైన్ షాపు ముందు మృతి చెందాడు. వైన్స్ షాపు సిబ్బంది కొట్టి హత్య చేశారంటూ బుధవారం వైన్ షాపు ముందు కుటుంబ సభ్యులు మృతదేహంతో ఆందోళన చేపట్టారు. వైన్స్ లోని సీసీ కెమెరాలో రికార్డింగ్ లను తొలగించారంటూ ఆరోపిస్తున్నారు. పోలీసులు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.