అనారోగ్యంతో బాధపడుతూ వ్యక్తి ఆత్మహత్య
అనారోగ్యంతో బాధపడుతూ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం లొకేశ్వరం మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని సాధ్గం గ్రామానికి చెందిన ఉమ్మేడ నాగేష్ (51) కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రులు తిరిగిన తగ్గక పోవడంతో జీవితంపై విరక్తి చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.