ప్రాజెక్టులో లభ్యమైన గుర్తుతెలియని మృతదేహం ఆచూకీ లభ్యం

77చూసినవారు
భైంసా గడ్డెన్న వాగు ప్రాజెక్టులో
గురువారం లభ్యమైన గుర్తుతెలియని మృతదేహం ఆచూకీ తెలిసినట్లు పట్టణ ఎస్ఐ సుదర్శన్ తెలిపారు. కుబీర్ మండలం హల్తా కు చెందిన బత్తిని సాయినాథ్ (33)మద్యానికి బానిసయ్యాడు. ఇంట్లో కుటుంబీకులతో తరచూ గొడవ పడేవాడు. గొడవపడిన ఆయన ఇంటి నుంచి వెళ్లి ప్రాజెక్టులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. మృతుడి భార్య సంగీత ఫిర్యాదుతో కేసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్