సీఎం రేవంత్ రెడ్డిని హైదరాబాద్ లోని ఆయన నివాసంలో అదిలాబాద్ పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓటమి చెందిన ఆత్రం సుగుణ మంగళవారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఇందులో ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క, కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి సత్తు మల్లేష్ తదితరులున్నారు.