ముంబై లో కుప్పకూలిన ఫుట్ ఓవర్ బ్రిడ్జి

69944చూసినవారు
ముంబై ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ (సీఎస్ఎంటీ) సమీపంలో పాదచారుల వంతెన ఒక్కసారిగా కుప్పకూలింది.
సీఎస్ఎంటీ ప్లాట్‌ఫాం 1కు దారితీసే వంతెన గురువారం రాత్రి కుప్పకూలడంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురై పరుగులు తీశారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు నలుగురు మృతి చెందగా, 36 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు. ఈ ఘటనతో ఒక్కసారిగా ట్రాఫిక్ స్తంభించింది. సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.

ట్యాగ్స్ :