నందిపేట్ మండలం ఉమ్మెడలో ఉమామహేశ్వర ఆలయం వద్ద గోదావరి నదిలో ప్రమాదవశాత్తు జారిపడి యువకుడు మృతిచెందాడు. మృతుడు ఏపీలోని నెల్లూరు జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. అతను నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలో మేస్త్రిగా పనిచేస్తున్నాడు. శనివారం ఉమామహేశ్వర ఆలయంలో దర్శనం చేసుకొని, మిత్రులతో కలిసి నది వద్దకు వెళ్లగా ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.