ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్ లను సకాలంలో అందించేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. స్కూల్ యూనిఫామ్ లను కుట్టే బాధ్యతలను మహిళా స్వయం సహాయక సంఘాలకు అప్పగించగా, డిచ్ పల్లిలోని మహిళా శక్తి కుట్టు కేంద్రాన్నీ కలెక్టర్ శుక్రవారం సందర్శించారు.