AP: వచ్చే నెల 4న ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అల్లరు చెలరేగే అవకాశం ఉందన్న సమాచారంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేస్తోన్న పోలీసులు.. అక్రమ ఆయుధాలు, గుర్తింపు లేని వాహనాలు, పేలుడు పదార్థాలు వంటివి గుర్తించి స్వాధీనం చేసుకుంటున్నారు. ఇప్పటికే 24 కేసులు నమోదు చేసి పలువురిని అరెస్ట్ చేశారు.