రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు

3635చూసినవారు
నిర్మల్ జిల్లా బాసర నుంచి చెరుకు లోడుతో ఉన్న వాహనం నిజామాబాద్ వైపు వెళుతుంది. అదే సమయంలో నవీపేట్ నుంచి శివతాండ వైపు వ్యాన్ వెళుతుంది. అయ్యప్ప ఆలయం మూల మాలుపు వద్ద రెండు వాహనాలు ఒకదానికి ఒకటి ఢీ కొట్టి ఓ బొలెరో వాహనం, టాటా ఎసి వాహనం బోల్తాపడ్డాయి. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలు కాగా 108 అంబులెన్స్ నిజామాబాద్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియారాలేదని ఎస్సై వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్