భారీగా డెంగ్యూ కేసులు...తస్మాత్ జాగ్రత్త

77చూసినవారు
భారీగా డెంగ్యూ కేసులు...తస్మాత్ జాగ్రత్త
నిజామాబాద్ జిల్లా పలు నియోజకవర్గాలలో జ్వరాలు విజృంభిస్తుండటంతో హాస్పిటల్స్ రోగులతో కిటకిటలాడుతున్నాయి. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ ఓపీ సగటున 10-30 శాతం వరకు పెరగినట్లు అధికారులు తెలిపారు. వర్షాలు కురుస్తుండటంతో గత ఇరవై రోజులుగా జ్వారల బారిన పడుతున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతుంది. ఎవరైనా జ్వరంతో బాధపడుతుంటే వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చి రక్త పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు శుక్రవారం సూచించారు.

సంబంధిత పోస్ట్