పిట్లంలో చలివేంద్రం ఏర్పాటు
కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలోని ముకుంద రెడ్డి కాలనీ కాంప్లెక్స్ ఆవరణలో శుక్రవారం కాంప్లెక్స్ నిర్వాహకులు చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఎండలు విపరీతంగా ఉండడంతో ప్రజలకు దాహార్తిని తీర్చడానికి చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు కాంప్లెక్స్ ని నిర్వాకులు తెలిపారు.