AP: రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ తీవ్ర కలకలం రేపుతోంది. అయితే దీనిపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. బర్డ్ ఫ్లూ పూర్తిగా తగ్గుముఖం పట్టిందన్నారు. 40 లక్షలకు పైగా కోళ్లు చనిపోయినట్టు సోషల్ మీడియాలో వచ్చిన ప్రచారం అవాస్తవమన్నారు. రాష్ట్రంలో 10 కోట్ల కోళ్లు ఉంటే 5.42లక్షల కోళ్లు ఈ వ్యాధితో చనిపోయాయని తెలిపారు. ప్రభుత్వపరంగా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు.