ఛత్తీస్ఘడ్లోని బస్తర్ లోక్సభ నియోజకవర్గంలో శుక్రవారం పోలింగ్ జరిగింది. అయితే నక్సల్ నేత హిడ్మాకు చెందిన పువర్తి గ్రామంలో ప్రజలు ఎవరూ ఓటు హక్కును వినియోగించుకోలేదు. ఆ నియోజకవర్గంలో 67.56 శాతం పోలింగ్ నమోదు అయింది. కానీ పువర్తి గ్రామ పోలింగ్ బూత్ నుంచి ఎవరూ ఓటు హక్కును వినియోగించుకోలేదు. భయం వల్ల గ్రామస్తులు ఓటు వేయలేదని బూత్ లెవల్ ఆఫీసర్ తెలిపారు.