భర్త క్రూరత్వానికి ఓ నిండు గర్భిణి ప్రాణాలు కోల్పోయింది. పంజాబ్లోని అమృత్సర్లో ఈ దారుణ ఘటన జరిగింది. రయ్య ప్రాంతంలోని బులేద్ నంగల్ గ్రామంలో భార్యాభర్తలైన పింకీ, సుఖ్దేవ్ నివసిస్తున్నారు. పింకీ ఆరు నెలల గర్భిణి. ఆమె కడుపులో కవలలు పెరుగుతున్నారు. అయితే భార్యాభర్తల మధ్య శుక్రవారం గొడవ జరిగింది. ఆగ్రహించిన సుఖ్దేవ్, గర్భిణి అయిన భార్య పింకీని మంచానికి కట్టేసి నిప్పుపెట్టాడు. మంటల్లో కాలిపోయిన పింకీ మరణించింది.