మధ్యప్రదేశ్ మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత కమల్ నాథ్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ‘జై శ్రీరామ్’ నినాదాలు చేశారు. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కమల్ నాథ్ శనివారం బేతుల్లో ఎన్నికల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా హిందూ ధర్మం గురించి ఆయన మాట్లాడారు. ప్రసంగం ముగింపులో ‘జై శ్రీరామ్’ అని అన్నారు. అలాగే ‘జై శ్రీరామ్’ అనాలని జనాలను కోరారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.