వివాదంలో మధ్యప్రదేశ్ మాజీ సీఎం

54చూసినవారు
వివాదంలో మధ్యప్రదేశ్ మాజీ సీఎం
మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్‌ నేత కమల్‌ నాథ్‌ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ‘జై శ్రీరామ్’ నినాదాలు చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కమల్‌ నాథ్‌ శనివారం బేతుల్‌లో ఎన్నికల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా హిందూ ధర్మం గురించి ఆయన మాట్లాడారు. ప్రసంగం ముగింపులో ‘జై శ్రీరామ్’ అని అన్నారు. అలాగే ‘జై శ్రీరామ్’ అనాలని జనాలను కోరారు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

సంబంధిత పోస్ట్