ఏపీసీసీ చీఫ్ షర్మిలకు ఎన్నికల సంఘం శుక్రవారం నోటీసులు జారీ చేసింది. ఆమె ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని వైసీపీ నేతలు అవినాష్రెడ్డి, మల్లాది విష్ణు, వివేకా హత్య కేసులో అప్రూవర్ దస్తగిరి ఈసీకి వేర్వేరుగా ఫిర్యాదు చేశారు. ఎన్నికల ప్రచారంలో షర్మిల వివేకా హత్యను ప్రస్తావించి ఎన్నికల నియమావళిని ఉల్లఘించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన ఈసీ.. 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలని షర్మిలకు నోటిసులిచ్చింది.