పారిస్ ఒలింపిక్స్-2024లో భారత్ తరుపున 117 మంది క్రీడాకారులు పాల్గొననున్నారు. వారిలో వయస్సు పరంగా చూస్తే భారత స్టార్ టెన్నిస్ ఆటగాడు రోహన్ బోపన్న అది పెద్ద అథ్లెట్. 44 ఏళ్ల వయసులో పారిస్ ఒలింపిక్స్కు ఆయన పయనమయ్యారు. అతి చిన్న వయస్కురాలిగా బెంగళూరుకు చెందిన 14 ఏళ్ల బాలిక ధీనిధి దేశింగు నిలిచింది. ప్రస్తుతం 9వ తరగతి చదువుతున్న ఆమె భారత్ తరుపున మహిళల 200 మీటర్ల ఫ్రీస్టైల్ ఈవెంట్లో పాల్గొననుంది.