మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన ‘ఆపరేషన్ వాలెంటైన్’ మార్చి 1న థియేటర్లలో విడుదల అవుతోంది. శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో వరుణ్ కి జోడిగా బాలీవుడ్ నటి మానుషి చిల్లర్ నటిస్తోంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బ్యాక్డ్రాప్లో హిస్టారికల్ యాక్షన్ థ్రిల్లర్గా రాబోతున్న ఈ చిత్రం గత ఏడాది డిసెంబర్లోనే రిలీజ్ కావాల్సింది. కానీ ఫిబ్రవరి 16 కు వాయిదా పడింది. మరలా వాయిదా వేసి, తాజాగా మార్చి 1న రిలీజ్ చేస్తున్నారు.