వరుసగా మూడో రోజూ తగ్గిన పసిడి ధరలు

80చూసినవారు
వరుసగా మూడో రోజూ తగ్గిన పసిడి ధరలు
దేశీయంగా పసిడి ధరలు వరుసగా మూడో రోజూ కూడా తగ్గాయి. బడ్జెట్‌లో బంగారంపై కస్టమ్స్‌ డ్యూటీని 15 నుంచి 6 శాతానికి తగ్గించడంతో ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. ఇక తాజాగా 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం మీద వెయ్యి రూపాయల మేర తగ్గింది. దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం 10 గ్రాములు పసిడి ధర రూ.71,650 పలకగా.. గురువారం రూ.70,650కి తగ్గింది. వెండి ధర కూడా రూ.3,500 మేర క్షీణించి రూ.84 వేలుగా ఉంది. గత మూడు రోజుల్లో వెండి కిలోకు రూ.5 వేలు వరకు తగ్గింది.

సంబంధిత పోస్ట్