రోడ్డు ప్రమాదంలో పాకిస్థాన్ మహిళా క్రికెటర్లకు గాయాలు

75చూసినవారు
రోడ్డు ప్రమాదంలో పాకిస్థాన్ మహిళా క్రికెటర్లకు గాయాలు
పాకిస్థాన్‌ ఉమెన్‌ క్రికెటర్లు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. పాకిస్థాన్ మాజీ కెప్టెన్‌ బిస్మా మరూఫ్, లెగ్ స్పిన్నర్ గులాం ఫాతిమా ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఇద్దరు మహిళా క్రికెటర్లకు గాయాలు అయినట్లు సమాచారం. ప్రమాదానికి గురైన వెంటనే వాళ్లకి ప్రథమ చికిత్స అందించారు. ప్రస్తుతం వాళ్లిద్దరు పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు మెడికల్‌ టీమ్‌ పర్యవేక్షణలో ఉన్నట్లు పీసీబీ ప్రకటించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్