మనీశ్ సిసోడియాకు కోర్టులో చుక్కెదురు

55చూసినవారు
మనీశ్ సిసోడియాకు కోర్టులో చుక్కెదురు
ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టైన ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత మనీశ్ సిసోడియాకు మరోసారి షాక్ తగిలింది. ప్రస్తుతం తిహార్ జైలులో ఉన్న సిసోడియా కస్టడీ నేటితో ముగియడంతో ఆయనను కోర్టులో ఇవాళ హాజరుపర్చారు. ఈ నేపథ్యంలో ఆయన జ్యుడీషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు మరోసారి పొడిగించింది. ఏప్రిల్ 18 వరకు ఆయనకు కస్టడీ విధిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.

సంబంధిత పోస్ట్