పారిస్ పారా ఒలింపిక్స్కు రంగం సిద్ధమైంది. నేటి నుంచి ప్రారంభం కానున్న ఈ ఒలింపిక్స్లోనే భారత్ నుంచి అత్యధికంగా 84 మంది అథ్లెట్లు పోటీలో పాల్గొననున్నారు. ప్రారంభ వేడుకల్లో పతకధారులుగా జావెలిన్ త్రోయర్ సుమిత్, మహిళా షాట్ ఫుటర్ భాగ్యశ్రీ జాదవ్ వ్యహరించనున్నారు. భారత కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 11:30 గంటలకు వేడుకలు మొదలవుతాయి. కాగా.. టోక్యో ఒలింపిక్స్లో భారత్ 19 పతకాలతో సత్తా చాటిన విషయం తెలిసిందే.